అరెస్టు నుంచి తప్పించునేందుకు అవినాశ్ పడరాని పాట్లు..!!

ఠాగూర్
మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (11:22 IST)
మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడికి పాల్పడిన కేసులోని నిందితుల్లో ఒకడైన వైకాపా నేత దేవినేని అవినాశ్ ఇపుడు ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, అక్కడ చుక్కెదురైంది. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయి, ఇపుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరుగనుంది. 
 
కాగా, గత వైకాపా ప్రభుత్వ పాలనపై నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని అనేక మంది వైకాపా నేతలు రెచ్చిపోయారు. ఇందులోభాగంగా, టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి చేశారు. ఈ దాడి కేసు ఇపుడు వైకాపా నేతల మెడకు చుట్టుకుంది. ఇదే కేసులో ఇటీవల మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్టయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనినాశ్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. 
 
అవినాశ్ ఇప్పటికే ఓ సారి దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆయనను హైదరాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించగా, చుక్కెదురైంది. ఈ నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై కోర్టు మంగళవారం విచారించనుంది. దీంతో అందరి దృష్టి సుప్రీంకోర్టు తీర్పుపై నెలకొంది. సుప్రీంకోర్టు కూడా ముందస్తు బెయిల్ ఇవ్వకుంటే ఈ కేసులో దేవినేని అవినాశ్ అరెస్టు ఖాయంగా తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ-2 మూవీ విడుదలపై సందిగ్ధత

ఎనిమిదేళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడిన మలయాళ స్టార్ హీరో దిలీప్

డాక్టర్ రాజశేఖర్ కాలికి గాయం.. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరం

Prerna Arora: హిందీ లోనే కాక దక్షినాది లో కూడా ఆదరణ పొందుతున్న ప్రేరణ అరోరా

Kiran Abbavaram: చెన్నై లవ్ స్టోరీ సినిమా కంటెంట్ పై కాన్ఫిడెంట్ : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments