పవన్‌తో భేటీ అయిన వైకాపా కీలక నేత!

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (08:59 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో వైకాపాకు చెందిన కీలక నేత ఒకరు భేటీ అయ్యారు. హైదరాబాద్ నగరంలో ఈ భేటీ జరిగింది. ఆ నేత పేరు బొంతు రాజేశ్వర రావు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ వైకాపా కీలక నేత. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి వైకాపా అభ్యర్థిగా రాజేశ్వర రావు పోటీ చేయగా, ఆయనపై జనసేన పార్టీ అభ్యర్థి గెలుపొందారు. 
 
ఇపుడు రాజేశ్వర రావు జనసేనానితో భేటీ కావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ రాజ్ ఆర్.డబ్ల్యూఎస్ రాష్ట్ర మాజీ సలహాదారు అయిన రాజేశ్వర రావు హైదరాబాద్ నగరంలోని జనసేన పార్టీ కార్యలయంలో సమావేశమయ్యారు. 
 
కాగా, ఈయన గత 2014, 2019 ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా వైకపా నేతలు అంటీఅంటనట్టుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌తో ఆయన భేటీ కావడం ఇపుడు రాజకీయ వర్గాల్లో చర్చీనీయాంశంగా మారింది. ఈయన త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే ఇరు పార్టీల శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

Ravi Teja: మాస్ జాతర కోసం సబ్ ఇన్ స్పెక్టర్ లక్మణ్ భేరి ఏం చేశాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments