Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి మిత్రపక్షం వైసీపీ: పీసీసీ

Webdunia
సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (07:59 IST)
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వైసీపీ అతి విశ్వాసమైన మిత్రపక్షమని పీసీసీ చీఫ్‌ సాకే శైలజనాథ్‌ అన్నారు. వైసీపీ నేతలు  సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లపై ఢిల్లీలో ఒకమాట, అమరావతిలో మరో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు.

విజయవాడలో ఆయన మీడియాతో  మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రయోజనాలు’ ప్రతి ఒక్కరికీ ఒక వాడుకపదంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. లోగడ చంద్రబాబు ఈవిధంగా ‘రాష్ట్ర ప్రయోజనా’లను ఉపయోగించుకుని ఏమీ సాధించలేకపోయారని ఎద్దేవా చేశారు.

శాసనమండలిని రద్దు చేయాలని ఢిల్లీ పెద్దలను కోరడం రాష్ట్ర ప్రయోజనమా అని సీఎం జగన్‌ను నిలదీశారు. ఒకపక్క బీజేపీ ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమని చెబుతున్నా వాళ్ల కాళ్లు పట్టుకోవడానికి గల కారణం ఏమిటని అడిగారు.

రాజధాని అమరావతిపై బీజేపీ నేతలు నచ్చినట్లుగా ప్రకటన చేస్తూ నాటకాలు ఆడుతున్నారని శైలజానాథ్‌ విమర్శించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments