Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచాయతీ ఎన్నికలు సజావుజా సాగాలే చర్యలు తీసుకోవాలి : యనమల

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (15:28 IST)
ఏపీలో పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగేలా రాష్ట్ర గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్ చర్యలు తీసుకోవాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విజ్ఞప్తి చేశారు. ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆయన స్పందించారు. 
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తొలి ద‌శ‌ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేష‌న్ విడుద‌లైన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం ఎన్నిక‌ల‌కు స‌హక‌రించ‌క‌పోతుండ‌టం విచారకరమన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక కూడా ఇటువంటి తీరు ప్ర‌ద‌ర్శిస్తుండ‌డం దేశ చరిత్రలోనే ఎక్క‌డా లేదని ఆయ‌న విమ‌ర్శించారు.
 
స్థానిక పాలన అందించటంలో రాష్ట్ర‌ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. ప్ర‌భుత్వ మాట‌లు వింటూ రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు పాల్పడటం స‌రికాద‌ని ఉద్యోగులకు హిత‌వు ప‌లికారు. 
 
ఎన్నిక‌ల విధుల్లో అధికార యంత్రాంగాన్ని పాల్గొనకుండా చేయడం ద్వారా ముఖ్య‌మంత్రి జగన్‌ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారని అన్నారు. రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తున్న జ‌గ‌న్ తగిన మూల్యం చెల్లించుకుంటార‌ని తెలిపారు.
 
పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగేలా గవర్నర్‌ తన అధికారాల‌ను వినియోగించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉందన్నారు. రాజ్యాంగానికి లోబడి త‌మ విధులు నిర్వ‌ర్తిస్తామ‌ని ప్రమాణం చేసి పనిలో చేరిన‌ ఉద్యోగులు, అధికారులు ఆ విష‌యాన్ని గుర్తు చేసుకోవాలని యనమల హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments