ఉద్యోగులను వాడుకుని వదిలేశారు.. జగన్‌ను మించివారు లేరు

Webdunia
బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (16:06 IST)
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఉద్యోగులను వాడుకుని వదిలేశారని.. ఇలా చేయడంలో జగన్‌ను మించినవారు లేరంటూ మండిపడ్డారు. 
 
అన్నా.. అన్నా అంటూ అవసరం తీరాక అవమానకర రీతిలో సాగనంపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు, ఉద్యోగుల పట్ల జగన్ మోహన్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరించారని ఆరోపించారు.
 
ప్రతిపక్షాల నేతలను అరెస్ట్ చేసేందుకు అడ్డగోలుగా వాడుకున్నారని, అవసరం తీరాక అవమానకర రీతిలో సవాంగ్‌ను గెంటేశారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, పీవీ రమేష్, అజేయ కల్లాంలను కూడా జగన్ ఇలానే అవమానించారు. 
 
చీకటి జీవోల ఆద్యుడు ప్రవీణ్ ప్రకాశ్‌ను ఆకస్మికంగా ఢిల్లీ పంపించేశారు. జగన్ వ్యవహార శైలిని అందరూ అర్థం చేసుకోవాలి' అని యమమల కోరారు. డీజీపీ స్థాయి వ్యక్తికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా అవమానించారని ఆయన మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments