కంటిలో పొడవాటి పురుగు.. ఆపరేషన్ తీసి వెలికి తీశారు.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (11:00 IST)
కంటిలో నలుసు పడితేనే తట్టుకోలేం. అలాంటి పొడవాటి పురుగు చేరితే ఇంకేమైనా వుందా.. అలాంటి ఘటనే విశాఖలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విశాఖ నగర పరిధిలోని పెందుర్తికి చెందిన బి.భారతి గత కొంతకాలంగా తీవ్రమైన కంటి నొప్పితో బాధపడుతోంది. స్థానికంగా ఉన్న వైద్యులకు చూపించగా వారు మందులు రాసిచ్చారు. 
 
ఎన్ని మందులు వాడుతున్నా తాత్కాలిక ఉపశమనం తప్ప సమస్య తీరక పోవడంతో శంకర్‌ ఫౌండేషన్‌ వైద్యశాలకు వెళ్లింది. అక్కడ ఆమె కంటిని పరిశోధించిన వైద్యులు ఆమె కంటిలో పురుగు వున్నట్లు గుర్తించారు. ఆపై ఆపరేషన్‌ అవసరమని వైద్యులు తెలిపారు. ఆపరేషన్‌ చేసి ఆమె కంటిలో ఉన్న 15 సెంటిమీటర్ల పొడవైన నులిపురుగును వెలికితీశారు. 
 
ఇన్నాళ్ల పాటు కంటిలో వుండిపోయిన ఆ పొడవాటి నులిపురుగును చూసి వైద్యులు షాకయ్యారు. శస్త్రచికిత్స అనంతరం కంటి నొప్పి నుంచి ఉపశమనం లభించడంతో భారతి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నాళ్లు కంటి నొప్పితో తాను పడిన ఇబ్బంది అంతా ఇంతా కాదని వాపోయింది. వైద్యులు ఆ నొప్పి నుంచి తనను కాపాడారని చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతారా ఎఫెక్ట్.. టాలీవుడ్ హీరోల కళ్లపై కునుకు లేకుండా చేస్తోన్న రిషబ్ శెట్టి?

కపుల్ ఫ్రెండ్లీ నా కెరీర్ లో గుర్తుండిపోయే మూవీ అవుతుంది :సంతోష్ శోభన్

ది ఇండియా హౌస్ తో తెలుగులో ఎంట్రీ ఇస్తున్న కంపోజర్ శాశ్వత్ సచ్‌దేవ్

Nabha Natesh: మహాశివరాత్రికి మైథలాజికల్ యాక్షన్ డ్రామా నాగబంధం టీజర్

అలాంటి బుర్ర వున్నవాడితో పిల్లల్ని కంటే కష్టమే, అందుకే వదిలేసా: మృణాళ్ ఠాకూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments