Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెట్టి చాకిరీ చేయించుకున్న సంస్థకు జరిమానా!

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (11:06 IST)
భారతీయ నిపుణులతో వెట్టి చాకిరీ చేయించుకుని అతి తక్కువ వేతనాలిచ్చిన ఓ అమెరికా కంపెనీకి జరిమానా విధించారు. సిలికాన్ వ్యాలీ కేంద్రంగా ప్రింటింగ్ రంగంలో పేరుగాంచిన ‘ఎలక్ట్రానిక్స్ ఫర్ ఇమేజింగ్ ఇన్ కార్పొరేటెడ్’ సంస్థ భారతీయుల శ్రమను దోచుకుంది. ఇందుకుగాను రూ.25,80,000లను భారతీయ నిపుణులకు పెనాల్టీగా చెల్లించాలని ఆ సంస్థకు అమెరికా కార్మిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. 
 
గతేడాది 728 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించిన ఆ సంస్థ భారతీయ నిపుణులతో మితిమీరిన స్థాయిలో పనిచేయించుకుని, వారికి తగిన మేర వేతనాలు ఇవ్వకపోవడంతో పాటు ఉద్యోగుల వేతనాల చెల్లింపు విషయంలో సదరు సంస్థ నిబంధనలను అతిక్రమించిందని కూడా అమెరికా కార్మిక శాఖ తేల్చింది.
 
కంపెనీ పురోగతి కోసం వారానికి 122 గంటల పాటు పనిచేసిన ఎనిమిదిమంది భారత నిపుణులు గంటకు కేవలం 1.21 డాలర్లను మాత్రమే అందుకున్నట్లు కార్మిక శాఖ తెలిపింది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments