Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యంకు డబ్బు లేదని శానిటైజర్లు తాగిన మహిళల మృతి

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (16:10 IST)
అసలే కరోనా కష్టకాలం. చిత్తు కాగితాలు ఏరితే తప్ప జీవనం సాగదు. అందులోను తిండితో పాటు మద్యానికి బానిసైన ఒక కుటుంబం శానిటైజర్లు తాగడం అలవాటుగా మార్చుకుంది. నీళ్లలో శానిటైజర్లు వేసుకుని తాగడం అలవాటు చేసుకున్న ఆ కుటుంబం చివరకు మత్తు ఎక్కువ కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయారు.
 
తిరుచానూరు సరస్వతినగర్‌కు చెందిన మల్లిక, లత, సెల్వంలు ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరు గత కొన్ని సంవత్సరాలుగా తిరుచానూరు చుట్టుప్రక్కల చెత్త కాగితాలు ఏరుకుని జీవనం సాగించేవారు. కరోనా సమయంలో మూడు నెలల పాటు పోషణ కరువై ఇబ్బందులు పడ్డారు.
 
అయితే గత వారంరోజుల నుంచి చెత్త ఏరుకుని వచ్చిన డబ్బుతో కుటుంబం నడిచేది. దాంతో పాటు మద్యానికి బానిసయ్యారు వీరు ముగ్గురు. డబ్బులు సరిపోకపోవడంతో గత మూడురోజుల నుంచి శానిటైజర్‌ను నీళ్లలో కలుపుకుని తాగారు. మొదటి రెండురోజులు బాగానే ఉన్నా నిన్న రాత్రి శానిటైజర్లలోని రసాయానాల వల్ల మత్తు ఎక్కువై అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు.
 
అయితే ఈ రోజు ఉదయం కొంతమంది స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా అప్పటికే ముగ్గురు మరణించారు. మార్చురీకి మృతదేహాలను తరలించి పంచనామా నిర్వహిస్తున్నారు తిరుచానూరు పోలీసులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గ్యాస్ సమస్య కారణంగానే బన్నీ హాజరుకాలేదు : అల్లు అరవింద్

Casting Couch: స్టార్ హీరో నుంచి ఆఫర్ వచ్చింది.. డ్రెస్సా-బికినీయా అనేది నా నిర్ణయం

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments