Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను చనిపోయాన‌ట‌... పెన్షన్ ఆపేశారు! వృద్ధ మ‌హిళ ఆవేద‌న‌

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (09:48 IST)
ఆమె బ‌తికుండ‌గానే రెవిన్యూ రికార్డుల్లో చంపేశారు. డెడ్ అని స‌ర్టిఫికేట్ ఇచ్చేశారు. వ‌చ్చే పెన్ష‌న్ ని అపేశారు. బాబూ నేనింకా బ‌తికే ఉన్నా అంటూ ఆ వృద్ధ మ‌హిళ ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది.

కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ కొత్తపాలెం గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ సుందరమ్మ అనే వృద్ధురాలు ప్రతినెలా వితంతు పెన్షన్ తీసుకుంటూ ఉంది. రెండు నెలల క్రితం అనారోగ్య సమస్యలతో తన కుమార్తె వద్ద కొన్ని రోజులు ఉండటానికి వెళ్ళింది. ఆ తర్వాత తిరిగి వ‌చ్చి, తనకు పెన్షన్ ఇవ్వలేదని ఆ గ్రామ వాలంటైర్ ని అడుగగా, వచ్చేనెలలో రెండు నెలల పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత నెల కూడా తనకు పెన్షన్ ఇవ్వలేదని వాపోయింది.

తాజాగా ఈ నెలలో కూడా తనకు పెన్షన్ రాకపోవడంతో, గ్రామ వాలంటైర్ ని ప్రశ్నించగా, ఆమె సరైన సమాధానం చెప్పలేదు. నా పెన్ష‌న్ ఏద‌ని గట్టిగా అడిగితే, పై అధికారులు చెప్ప వద్దన్నారని చెబుతూ తనకు పెన్షన్ ఇవ్వలేదని వృద్ధురాలు తెలిపింది. పెన్షన్ ఇవ్వకపోగా, తాను చనిపోయానని అంటున్నారని వృద్ధురాలు వాపోయింది.

ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు మూడు నెలలుగా రావాల్సిన పెన్షన్ ఇప్పించాల్సిందిగా వేడుకుంటోంది ఆ మ‌హిళ‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కల్యాణ్ పైన పోసాని, శ్రీరెడ్డి దుర్భాషలు: ఏపీ హోం మంత్రికి గబ్బర్ సింగ్ సాయి కంప్లైంట్

రామ్ చరణ్ బ్యాక్ ఫోజ్ సూపర్.. గేమ్ ఛేంజర్‌లో కలుద్దాం

అమ్మతోడుగా చెబుతున్నా.. కోర్టులు దోషిగా నిర్ధారించలేదు.. అప్పటివరకు నిర్దోషినే : నటి హేమ

నిజమైన భారతీయుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్: ఎస్.జె సూర్య (Video)

రూ.1,000 కోట్ల క్లబ్‌కు చేరువలో ప్రభాస్ "కల్కి 2898 AD"

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments