Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతలో మహిళను వివస్త్రను చేసి.. చితకబాదిన గ్రామస్తులు..!

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (17:46 IST)
సభ్య సమాజాం సిగ్గుపడే రీతిలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులంతా ఏకమై ఓ మహిళను వివస్త్రను చేసి, చితకబాదారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా హిందూపురం పరిధిలోని వడ్డిపల్లి గ్రామంలో కలకలం రేపింది. 
 
పోలీసుల వివరాల ప్రకారం.. కళ్యాణి దుర్గానికి చెందిన గౌరీబాయి పది సంవత్సరాల క్రితం హిందూపురం ప్రాంతానికి వలస వచ్చింది. అక్కడ ఆ మహిళ వడ్డిపల్లి గ్రామంలో ప్రభుత్వ స్థలంలో ఒక షెడ్‌ వేసుకుని జీవనం సాగిస్తోంది. 
 
అయితే ఆ స్థలంలో దేవాలయాన్ని నిర్మించాలని స్థానికులు భావించారు. ఇందుకోసం ఆ మహిళను ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా గ్రామస్థులు తెలిపారు. అయితే ఆమె ససేమిరా అనడంతో ఆమెతో గొడవ పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ విషయంలో కల్పించుకున్న పోలీసులు మహిళకు వేరే చోట నివాసం ఏర్పాటు చేసి ఇవ్వాలని గ్రామస్థులకు సూచించారు. ఈ స్థితిలో గ్రామస్థులు కొందరు మంగళవారం రోజు మహిళపై దాడికి పాల్పడ్డారు. ఆమెను వివస్త్రను చేసి చితకబాదారు. 
 
సమాచారం అందుకున్న హిందూపురం పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే, గ్రామస్థులు కొందరు మాత్రం ఆ మహిళ మంత్రాలు చేస్తోందని, పలువురితో వ్యభిచారం చేస్తోందని  ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments