Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తపై కోపంతో కిరోసిన్‌ పోసి నిప్పంటించుకున్న భార్య

Webdunia
బుధవారం, 18 మే 2016 (14:56 IST)
చిత్తూరు జిల్లాలో మరో దారుణం జరిగింది. క్షణికావేశంలో భర్తపై ఉన్న కోపంతో ఓ మహిళ ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. భార్యను కాపాడబోయిన భర్తకు తీవ్రగాయాలయ్యాయి. భార్యాభర్తలిద్దరు చావుబతుకుల మధ్య ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
 
చిన్నగొట్టికల్లు దిగువ వీధిలో శ్రీనివాసులు, రేణుకలు నివాసముంటున్నారు. పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. చిన్న విషయానికి కూడా భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేదని స్థానికులు చెబుతున్నారు. బుధవారం ఉదయం వీరి మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరగడంతో మనస్థాపానికి గురైన రేణుక ఇంటిలో తలుపులు మూసుకుని కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. 
 
దీన్ని గమనించిన భర్త శ్రీనివాసులు తలుపులు పగులగొట్టి రేణుకను కాపాడే ప్రయత్నం చేయగా అతను కూడా మంటల్లో చిక్కుకున్నాడు. ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు ప్రభుత్వాసుప్రతికి తరలించారు. రేణుక, శ్రీనివాసుల పరిస్థితి ఆందోళనా కరంగా వైద్యులు నిర్థారించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments