Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ప్రయాణిస్తూ బందరు కాల్వలో దూకిన మహిళ... ఎందుకు.. ఎక్కడ?

ఠాగూర్
సోమవారం, 4 నవంబరు 2024 (10:02 IST)
రైలులో ప్రయాణిస్తూ వచ్చిన ఓ మహిళ ఆకస్మికంగా ఓ నీటి కాలువలో దూకేసింది. దీంతో ఆమె నీటి ప్రవాహంలో కొట్టుకునిపోతూ చివరకి ఓ చెట్టును పట్టుకుని రాత్రంతా అలానే గడిపింది. ఈ ఘటన విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అయితే, ఈ మహిళ మానసిక సమస్యతో బాధపడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం మేరకు.. 
 
బాపట్ల జిల్లా భట్టిప్రోలుకు చెందిన ప్రైవేటు ఉద్యోగి షేక్ ఖాదర్ వలి భార్య, పిల్లలతో కలిసి నిజాంపట్నంలో ఉంటున్నారు. ఆయన భార్య జన్నతున్నీసా (47) కొన్నేళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతోంది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చిన ఆమె గుంటూరు జిల్లా నిడుబ్రోలులో విజయవాడ వైపు వెళ్లే రైలెక్కింది.
 
రాత్రి 11 గంటల సమయంలో రైలు విజయవాడ పూల మార్కెట్ పరిసరాలకు చేరుకుంది. అక్కడామె రైలు నుంచి కిందనున్న బందరు కాల్వలోకి దూకేసింది. నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ఓ చెట్టును పట్టుకుని రాత్రంతా అలాగే గడిపింది. ఉదయం స్థానికులు ఆమెను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి ఆమెను రక్షించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి, ఆసుపత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

Prabhas: నిర్మాత వదిలేసినా, ఇండస్ట్రీ వద్దన్నా మారుతీ తో ప్రభాస్ రాజాసాబ్ ఎందుకు చేశాడు

Rashmika: మా కెమిస్ట్రీ చూశాక మరిన్ని అవకాశాలు వస్తాయి : రష్మిక మందన్నా

Ye Maaya Chesave: ఏ మాయ చేసావే రీ-రిలీజ్: ప్రమోషన్ కోసం చైతూ- సమంత కలిసి కనిపిస్తారా?

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments