Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త శవంతో మూడు రాత్రులు గడిపిన భార్య! ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (15:00 IST)
అసలే కరోనా మహమ్మారి. ఇలాంటి సమయంలో సాధారణంగా చనిపోయినా కరోనా వైరస్‌తోనే చనిపోయారనే భయం పీడిస్తోంది. అందుకే సొంత కన్నతల్లిదండ్రులు చనిపోయినా, కన్నబిడ్డలు, తోబుట్టువులు, బంధువులు ఇలా ఏ ఒక్కరూ శవం సమీపానికి కూడా రావట్లేదు. అందుకేనేమో ఆ భార్య భర్త శవాన్ని ఇంట్లో పెట్టుకుని మూడు రోజుల ఒంటరిగా ఉండిపోయింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నిజామాబాద్ జిల్లా కొత్త హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన లింగా రెడ్డి అనే వ్యక్తి వృద్దాప్య సమస్యలతో మూడు రోజుల క్రితం చనిపోయాడు. ఈ విషయం మతిస్థిమితంలేని ఆయన భార్య శకుంతలకు తెలియదు. 
 
అలా మూడు రోజులపాటు గడిచిపోయింది. అయితే, లింగారెడ్డి ఇంటి నుంచి దుర్వాసన రావడాన్ని ఇరుగుపొరుగువారు గుర్తించి  ఇంట్లోకి వెళ్లి చూడగా లింగారెడ్డి చనిపోయివున్నాడు. దీంతో పోలీసులకు సమాచారం చేరవేయగా, వారు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ లింగారెడ్డి కుమారుడు హైదరాబాద్‌లో ఉండగా, కుమార్తె మాత్రం ఇంగ్లండ్‌లో నివసిస్తోంది. వీరికి పోలీసులే తండ్రి చనిపోయిన విషయాన్ని చేరవేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ సందేశ్ నింద కు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల జోరు

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సెట్స్ లో డైరెక్టర్ వివి వినాయక్ ఎంట్రీ

సెన్సేషనల్ నిర్ణయం ప్రకటించిన జానీ మాస్టర్

ప్రియదర్శి, నభా నటేష్ ల డార్లింగ్ వరల్డ్‌వైడ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధం

రాధాభాయ్ సాంగ్ లో మన్నారా చోప్రా మాస్ డ్యాన్స్ మూమెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments