Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క మహిళ.. ఐదుగురు పురుషులకు పునర్జన్మ...! విశాఖలో మహిళ అవయవదానం!!

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2015 (16:31 IST)
నలుగురికి జన్మనిచ్చి తీర్చిదిద్దిన ఓ తల్లి తాను తాను మరణిస్తూ కూడా మరో ఐదుగురు పురుషులకు పునర్జన్మనిచ్చింది. తన అవయవదానంతో వారిని సాధారణ మనుషులను చేసేందుకు సిద్ధమయ్యింది. విశాఖలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 

విశాఖ నగరం గాజువాక ప్రాంతంలోని సుందరయ్య కాలనీకి చెందిన ఆర్.రమణమ్మ(48) ఈనెల 27వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. తల్లిని బతికించుకోవడానికి ఆమె ఇద్దరు కుమారులు నానా తంటాలు పడ్డారు. అయితే ఆమెకు చికిత్స అందిస్తున్న కేర్ ఆస్పత్రి వైద్యులు చాలా ప్రయత్నాలు  చేసి రాత్రి బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. జీవన్ దాన్ అధికారులు రమణమ్మ ఇద్దరు కుమారులతో మాట్లాడారు. తమ తల్లి మరణించినా ఆమె అవయవాలు మరొకరికి పని వస్తాయనే ఉద్దేశ్యంతో ఆమె అవయవదానానికి అంగీకరించారు. ఆమె రెండు కిడ్నీలను విశాఖలో కేర్, అపొలో ఆస్పత్రుల్లో అవసరమున్న ఇద్దరు రోగులకు ఇచ్చేందుకు సమ్మతించారు. 
 
నేత్రదానానికి కూడా సమ్మతించారు. అంతేకాకుండా హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఇద్దరు రోగులకు లివర్, ఊపిరితిత్తులను అమర్చడానికి సమ్మతించారు. దీంతో ఆ మేరకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments