Webdunia - Bharat's app for daily news and videos

Install App

దంతెవాడలో ఎన్‌కౌంటర్ - శాఖమూరి అప్పారావు భార్య మృతి!

ఠాగూర్
మంగళవారం, 1 ఏప్రియల్ 2025 (10:15 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ - దంతెవాడ సరిహద్దుల్లో సోమవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళా మావోయిస్టు శాఖమూరి రేణుక అలియాస్ భాను అలియాస్ చైతే అలియాస్ సరస్వతి అలియాస్ దమయంతి ప్రాణాలు కోల్పోయింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు దివంగత శాఖమూరి అప్పారావు భార్య. మావోయిస్టు పార్టీ దండకారాణ్య స్పెషల్ జోనల్ సభ్యురాలిగా రేణుక పనిచేశారు. 
 
కాగా, రేణుకపై తెలంగాణాలో రూ.20 లక్షలు, ఛత్తీస్‌గఢ్‌లో రూ.25 లక్షలు రివార్డులు ఉన్నాయి. బీజాపూర్, దంతెవాడ సరిహద్దుల్లోని ఇకేలీ బెలీనార్ అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందుకున్న బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పులు జరిగాయి. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ కాల్పుల్లో రేణుక ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలం నుంచి ఇన్సాస్ రైఫిల్, పేలుడు పదార్థాలు, ల్యాప్‌టాప్, ఇతర వస్తువులను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments