Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో యువతి కిడ్నాప్‌... తల్లిదండ్రులే దాచేశారా...?

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2016 (20:14 IST)
తిరుపతిలో ఒక వివాహిత కిడ్నాప్‌కు గురైంది. రేణిగుంట రోడ్డు కాటన్‌ మిల్లుకు చెందిన ప్రసన్న కుమార్‌కు, అదే ప్రాంతానికి చెందిన తేజశ్రీకి 2015 అక్టోబర్‌ 20వ తేదీ వివాహమైంది. ఇంట్లో వీరి వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ప్రేమవివాహం చేసుకున్నారు. బెంగుళూరులోని రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వీరి వివాహం జరిగింది. కుటుంబ సభ్యులతో ఎలాంటి సంబంధాలు లేకుండానే ప్రసన్నకుమార్‌ తన కుటుంబాన్ని బెంగుళూరులో ఉంచాడు. 
 
అయితే ఈ నెల 18వ తేదీ తన కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్ళివస్తానని తేజశ్రీ తిరుపతికి వచ్చింది. ఆ తరువాత నుంచి తనకు కనిపించలేదంటూ ప్రసన్నకుమార్‌ తిరుపతి ఈస్టు పోలీసులను ఆశ్రయించాడు. తన భార్యను ఎవరో కిడ్నాప్‌ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ప్రసన్నకుమార్‌. అయితే తేజశ్రీని ఆమె తల్లిదండ్రులే కనిపించకుండా చేశారని కూడా ఫిర్యాదులో ప్రసన్న కుమార్‌ పేర్కొన్నాడు. తిరుపతి ఈస్టు పోలీసులు ఫిర్యాదు ఆధారంగా యువతి కోసం గాలిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments