ప్రైవేట్ ఆస్పత్రిలో డెలివరీకి వచ్చి బాత్రూమ్‌లో ప్రసవం.. బిడ్డను బక్కెట్‌లో వదిలి...

ఠాగూర్
మంగళవారం, 23 సెప్టెంబరు 2025 (14:14 IST)
ఓ మహిళ ప్రైవేట్ ఆస్పత్రిలో డెలివరీ కోసం వచ్చి బాత్రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత బిడ్డను బాత్రూమ్ బక్కెట్‌లో వదిలిపెట్టి పోయింది. కొంత సేపటికి ఆ పసికందు ఏడుపు శబ్దాలు విని ఆస్పత్రి సిబ్బంది గుర్తించి, బిడ్డను రక్షించారు. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా గిద్దలూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వెలుగు చూసింది. 
 
ఓ గర్భిణీ మహిళ ప్రసవం కోసం నడుచుకుంటూ ఆస్పత్రిగా ఆస్పత్రికి వస్తున్న దృశ్యాలు సీసీటీవీలో కనిపిస్తున్నాయి. అయితే, ఆ మహిళ వైద్యులను సంప్రదించకుండా ఆస్పత్రి బాత్రూమ్‌కు వెళ్లి, అక్కడే ఓ శిశువును ప్రసవించింది. ఆ బిడ్డను బాత్రూమ్ బక్కెట్‌లో వదిలిపెట్టి వెళ్లిపోయింది. శిశువు ఏడుపు శబ్దం విన్న ఆస్పత్రి సిబ్బంది వెంటనే స్పందించారు. 
 
అయితే, ఆ సమయంలో ఆ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆ శిశువును మరో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా ఆ మహిళ మరో వ్యక్తితో కలిసి ఆస్పత్రికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై ఆస్పత్రి యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

Bandla Ganesh: రవితేజకి ఆల్టర్నేట్ జొన్నలగడ్డ సిద్దు: బండ్ల గణేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments