Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడలిని చంపి పాతిపెట్టిన అత్తమామలు : హతురాలు జగన్ వ్యక్తిగత కెమరామెన్ భార్యనా?

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2015 (17:08 IST)
కృష్ణా జిల్లాలో ఓ దారుణం వెలుగు చూసింది. అత్తమామలు కలిసి తమ కోడలిని చంపి కాలువగట్టున పూడ్చిపెట్టారు. ఈ విషయం తాజాగా వెలుగుచూసింది. ఈ హతురాలు వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి వద్ద వ్యక్తిగత ఫోటోగ్రాఫర్‌గా పని చేస్తున్న వ్యక్తి భార్యగా భావిస్తున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కృష్ణా జిల్లా నాగాయలంక మండలం బరంకులకు చెందిన వంశీకృష్ణ భార్య వరలక్ష్మి మూడు నెలల క్రితం కనిపించకుండా పోయింది. దీనిపై వంశీకృష్ణ తన తల్లిదండ్రులతో కలిసి తన భార్య కనిపించడం లేదంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి మిన్నకుండిపోయారు.
 
అయితే, వరలక్ష్మి తల్లిదండ్రులు మాత్రం రాష్ట్ర మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. తమ కుమార్తె కనిపించడం లేదనీ, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హెచ్‌ఆర్సీ.. వరలక్ష్మి అదృశ్యాన్ని తేల్చాలంటూ జిల్లా ఎస్పీని ఆదేశించింది. 
 
దీంతో రంగంలోకి దిగిన జిల్లా పోలీసులు వరలక్ష్మి అదృశ్యం మిస్టరీని చేధించారు. వరలక్ష్మిని అత్తామామలు కలిసి హత్య చేసి స్థానికంగా ఉండో ఓ పంట కాల్వకు సమీపంలోనే పాతిపెట్టినట్టు కనుగొన్నారు. విషయం వెలుగులోకి రావడంతో వంశీకృష్ణ కనిపించకుండా పోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments