Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్నం కోసం నిండు గర్భిణిని కాల్చేశారు.. మృగంలా మారిన భర్త...

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఓ దారుణం జరిగింది. కట్నం కోసం నిండు గర్భిణిని కాల్చేశాడు. ఈ దారుణానికి కట్టుకున్న భర్తే మృగంలా మారిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2017 (11:31 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఓ దారుణం జరిగింది. కట్నం కోసం నిండు గర్భిణిని కాల్చేశాడు. ఈ దారుణానికి కట్టుకున్న భర్తే మృగంలా మారిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
నిజామాబాద్‌లోని నిజాం కాలనీకి చెందిన ఎస్‌కే ముజీబ్‌ఖాన్‌కు ఏడాది క్రితం నిర్మల్‌ జిల్లా కొల్లూర్‌కు చెందిన సనా బేగం (23)తో వివాహమైంది. ఆటో నడుపుతూ జీవించే ముజీబ్‌ కొద్ది రోజులుగా భార్యను అదనపు కట్నం కోసం వేధించటం ప్రారంభించాడు. 
 
ఈ క్రమంలో మంగళవారం అర్థరాత్రి నిద్రిస్తున్న సనాపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 
 
బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ప్రసవించింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి ప్రాణాలు విడిచింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

తర్వాతి కథనం
Show comments