Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్నం కోసం నిండు గర్భిణిని కాల్చేశారు.. మృగంలా మారిన భర్త...

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఓ దారుణం జరిగింది. కట్నం కోసం నిండు గర్భిణిని కాల్చేశాడు. ఈ దారుణానికి కట్టుకున్న భర్తే మృగంలా మారిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2017 (11:31 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఓ దారుణం జరిగింది. కట్నం కోసం నిండు గర్భిణిని కాల్చేశాడు. ఈ దారుణానికి కట్టుకున్న భర్తే మృగంలా మారిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
నిజామాబాద్‌లోని నిజాం కాలనీకి చెందిన ఎస్‌కే ముజీబ్‌ఖాన్‌కు ఏడాది క్రితం నిర్మల్‌ జిల్లా కొల్లూర్‌కు చెందిన సనా బేగం (23)తో వివాహమైంది. ఆటో నడుపుతూ జీవించే ముజీబ్‌ కొద్ది రోజులుగా భార్యను అదనపు కట్నం కోసం వేధించటం ప్రారంభించాడు. 
 
ఈ క్రమంలో మంగళవారం అర్థరాత్రి నిద్రిస్తున్న సనాపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 
 
బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ప్రసవించింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి ప్రాణాలు విడిచింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments