Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకు స్నేహితుడితో ఎఫైర్, భర్తకు తెలిసింది, అంతే...

Webdunia
గురువారం, 10 సెప్టెంబరు 2020 (22:17 IST)
వరసకు కొడుకైన వ్యక్తితోనే అక్రమ సంబంధం పెట్టుకుంది ఒక వివాహిత. ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్న ఆమె భర్త పనుల మీద తరచూ బయటకు వెళ్ళడంతో వరుసకు కొడుకయ్యే వ్యక్తితో కమిట్ అయ్యింది. ఇది కాస్తా ఆమెను చివరకు కటాకటాల పాలు చేసింది.
 
తూర్పు గోదావరిజిల్లా పత్తిపాడు మండలం చింతలూరులో నివాసముంటున్నారు జంకల అప్పారావు. నిన్న ఆయన తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు భార్యను విచారించడంతో అసలు విషయం ఒప్పుకుంది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
అప్పారావు నూనె వ్యాపారం చేసేవాడు. తరచూ వివిధ ప్రాంతాలకు వెళ్ళేవాడు. ఇంటి పట్టున ఉండేవాడు కాదు. అప్పారావు భార్య ఇంట్లోనే ఉండేది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే తన కుమారుడి స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది తల్లి.
 
అతనితో పాటు మూడు నెలల పాటు బాగా ఎంజాయ్ చేసింది. అయితే భర్తకు విషయం తెలియడంతో మందలించాడు. పెళ్ళీడుకొచ్చిన కుమార్తెలు ఉంటే ఈ పనులు ఏంటంటూ ప్రశ్నించాడు. దీంతో భర్త హత్యకే స్కెచ్ వేసింది భార్య.
 
ప్రియుడితో కలిసి నిన్న రాత్రి నిద్రపోతున్న అప్పారావును దారుణంగా హత్య చేసింది. దోపిడీ దొంగల పనేనని కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి దర్యాప్తు జరిపితే అసలు విషయం బయటపడింది. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments