వైఎస్సార్ బ్రాండ్ లేకపోతే ఒక్క ఓటు రాదు: షర్మిలకు శైలజ కౌంటర్

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (14:45 IST)
కాంగ్రెస్ దివంగత సీఎం వైఎస్సార్ పేరును ఒక బ్రాండ్‌లా అంద‌రూ వాడేస్తున్నార‌ని కాంగ్రెస్ నేత, ఏపీ సీసీ అధ్య‌క్షుడు  శైలజానాథ్ ఆరోపించారు. వై.ఎస్.ఆర్. పేరు పేరు వాడుకోకుండా ప్రజలకు ఏం చేశారో చెప్పాల‌న్నారు. కొత్త పార్టీలు పెట్టేవారు రాజశేఖరరెడ్డి పేరు వాడుకోకుండా ఒక్క ఓటు తెచ్చుకునే దమ్ము లేదని ఎద్దేవా చేసారు.
 
పార్టీలు పెడుతున్నవారు ప్రజలకు ఏం చేశారో చెప్పి వస్తే బాగుంటుందని ష‌ర్మిల‌కు చుర‌క వేశారు.
ప్రాణ త్యాగాలు చేసి తెచ్చుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ని కేంద్రం అమ్ముతుంటే, జగన్ నోరు విప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజల్ని దోచుకుంటున్నాయ‌ని ఆరోపించారు. వంద రూపాయలు డీజిల్ రేటు చేసిన ఘనత మోదీదని అన్నారు.
 
మోదీ ఆర్థిక మిత్రులకు నష్టం వస్తుందని పెట్రోల్, డీజిల్‌ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం లేదని ఆయన విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలు తక్షణమే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
అర శాతం అప్పు కోసం, సీఎం జగన్ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని మోదీ దగ్గర కుదవపెడుతున్నారని ఆరోపించారు. ఏ ప్రాంతానికైనా నీళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని అన్నారు. వివాదాలు సృష్టించుకుని, రెండు రాష్ట్రాల సీఎంలు రాజకీయాలు చేస్తున్నారని శైలజానాథ్ విమర్శించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments