Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదుచ్చేరి ఓటర్లకు ధన్యవాదాలు.. పరాజయంపై ఆత్మశోధన : సోనియా

Webdunia
శుక్రవారం, 20 మే 2016 (08:31 IST)
పుదుచ్చేరి ఓటర్లకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ధన్యవాదాలు తెలిపారు. అదేసమయంలో అసోం, కేరళలో కాంగ్రెస్ పార్టీకి ఎదురైన ఘోర పరాభవంపై అత్మశోధన చేసుకుంటామని ఆమె ప్రకటించారు. 
 
గురువారం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన విషయం తెల్సిందే. ఈ ఎన్నికల ఫలితాలపై ఆమె స్పందిస్తూ... 'అసెంబ్లీ ఎన్నికలలో మా పార్టీ ఓటమికి కారణాలేమిటో విశ్లేషించుకుంటాం. మరింత ఉత్తేజంతో ప్రజాసేవకు పునరంకితమవుతాం' అని వ్యాఖ్యానించారు. 
 
'అసోం, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కేరళల్లో ప్రజల తీర్పును సవినయంగా స్వీకరిస్తున్నాం. ప్రజాస్వామ్య ప్రక్రియను బలోపేతం చేయడంలో ఓటర్ల ఉత్సాహాన్ని హర్షిస్తున్నాం' అని వ్యాఖ్యానించారు. 
 
మరోవైపు.. అదేసమయంలో తిరిగి అధికారాన్ని కట్టబెట్టిన పుదుచ్చేరిన ఓటర్లకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నట్టు సోనియా గాంధీ పేర్కొన్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments