Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో భార్య పారిపోయింది... భర్త ఏం చేశాడంటే?

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (15:04 IST)
వివాహేతర సంబంధం ఒక కుటుంబాన్ని చిదిమేసింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతున్న ఒక కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. అన్యోన్యంగా సాగుతున్న కుటుంబంలో భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో మనస్థాపానికి గురైన భర్త ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి తాను విషం తాగాడు. చిత్తూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
 
కురబలకోట మండలం తెట్టు పంచాయతీ, ఎలకలవారి పల్లెకు చెందిన వెంకటేష్ కుమారుడు సుబ్బయ్య అతని భార్య వెంకటమ్మలు గ్రామానికి సమీపంలోని బండలపై రాయిపనులు చేసుకుని జీవనం సాగిస్తుండేవారు. సుబ్బయ్యకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తనతో పాటు పనిచేస్తున్న ఒక వ్యక్తితో వెంకటమ్మ వివాహేతర సంబంధం పెట్టుకుంది. 
 
భార్యను ఎన్నోసార్లు హెచ్చరించాడు. అయితే ఆమె వినిపించుకోలేదు. తన ప్రియుడితో కలిసి ఇంటి నుంచి వెళ్ళిపోయింది వెంకటమ్మ. దీంతో మనస్థాపానికి గురైన వెంకటేష్‌ తన ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి తాను విషం తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments