Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో భార్య పారిపోయింది... భర్త ఏం చేశాడంటే?

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (15:04 IST)
వివాహేతర సంబంధం ఒక కుటుంబాన్ని చిదిమేసింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతున్న ఒక కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. అన్యోన్యంగా సాగుతున్న కుటుంబంలో భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో మనస్థాపానికి గురైన భర్త ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి తాను విషం తాగాడు. చిత్తూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
 
కురబలకోట మండలం తెట్టు పంచాయతీ, ఎలకలవారి పల్లెకు చెందిన వెంకటేష్ కుమారుడు సుబ్బయ్య అతని భార్య వెంకటమ్మలు గ్రామానికి సమీపంలోని బండలపై రాయిపనులు చేసుకుని జీవనం సాగిస్తుండేవారు. సుబ్బయ్యకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తనతో పాటు పనిచేస్తున్న ఒక వ్యక్తితో వెంకటమ్మ వివాహేతర సంబంధం పెట్టుకుంది. 
 
భార్యను ఎన్నోసార్లు హెచ్చరించాడు. అయితే ఆమె వినిపించుకోలేదు. తన ప్రియుడితో కలిసి ఇంటి నుంచి వెళ్ళిపోయింది వెంకటమ్మ. దీంతో మనస్థాపానికి గురైన వెంకటేష్‌ తన ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి తాను విషం తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments