Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీని వణికిస్తానన్న జగన్... సీబీఐ పేరెత్తితే గజగజ వణికిపోతున్నారు...

Webdunia
మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (14:24 IST)
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల చుట్టూ ఇపుడు ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారనీ, ఆ కేసు సంగతి ఏమైదంటూ పవన్ సూటిగా ప్రశ్నించడంతో ఇపుడు ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. 
 
ఈ నేపథ్యంలో తన తండ్రి హత్య కేసులో విచారణకు ఏపీలోని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం సహకరించడంలేదని వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఆరోపించడం తెలిసిందే. తాజాగా డాక్టర్ సునీతారెడ్డి కామెంట్స్ వీడియోను టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అందరూ అడిగినట్టే తాను కూడా అడుగుతున్నానని, హూ కిల్డ్ బాబాయ్? అంటూ ట్వీట్ చేశారు.
 
"మీ చిన్నాన్నను మా నాన్న నరికేశాడన్నావు. దానిపై సీబీఐ దర్యాప్తు చేయాలన్నావు. ఇప్పుడెందుకు సీబీఐని వద్దంటున్నావు... చెప్పు అబ్బాయి!" అంటూ సీఎం జగన్ ను నిలదీశారు. వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సీబీఐ వస్తే చాలు... ఢిల్లీని గడగడలాడిస్తానన్న జగన్ గజగజా వణుకుతున్నాడు అని ఎద్దేవా చేశారు.

 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments