Webdunia - Bharat's app for daily news and videos

Install App

యుద్ధాన్ని గెలవడానికి జగన్‌కు బలాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నా: ఉండవల్లి

Webdunia
గురువారం, 30 జులై 2020 (17:08 IST)
సీనియర్ రాజకీయ నేత, న్యాయకోవిదుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ ముఖ్యమంత్రి పట్ల నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఆయనకు సూచనలు చేస్తున్నట్లుగా లేఖ రాస్తూనే తనదైన శైలిలో చురకలంటించారు.

ప్రైవేట్ ఆస్పత్రులను కూడా కొవిడ్ పరీక్షలకు అనుమతించి ఫీజు మొత్తాన్ని ప్రభుత్వం నిర్ణయించాలన్నారు. ప్రస్తుతం పేద, దిగువ మధ్య తరగతి ప్రజలు డబ్బు లేదా పలుకుబడి ఉంటే తప్ప కరోనా బారినపడి జీవించలేమని ఆవేదన చెందుతున్నారని తెలిపారు. 

కోవిడ్ రోగులకు తాత్కాలిక సహాయ కేంద్రాలు నడిపేందుకు ఫంక్షన్ హాళ్లను స్వాధీనం చేసుకుని ఎన్జీవోలు, ట్రస్టులకు అప్పగించాలని కోరారు. కోవిడ్ సహాయ కేంద్రాల నిర్వహణ ఖర్చును ఎన్జీవోలు, ట్రస్టులు భరిస్తాయని, ప్రభుత్వం నుంచి డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందిని అందించాలన్నారు.

రాజమండ్రిలో జైన్ సంఘం ఇప్పటికే అద్దెకు కళ్యాణ మండపం తీసుకొని 60 పడకలతో కరోనా సెంటర్‌ను నడుపుతోందని లేఖలో ఉండవల్లి అరుణ్‌కుమార్ తెలిపారు. కొవిడ్‌కు వ్యతిరేకంగా యుద్ధాన్ని గెలవడానికి సీఎం జగన్‌కు బలాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నానని ఉండవల్లి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments