Webdunia - Bharat's app for daily news and videos

Install App

పునర్జన్మ ఇచ్చిన ఉగాది అంటే ఎంతో ఇష్టం అన్న ఆ పెద్దాయన: ఎవరు?

తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు పలికిన రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ తెలుగు నేలతో తనకున్న అనుబంధాన్ని తల్చుకుని భావోద్వేగానికి గురయ్యారు. తెలుగు నేలతో తనకు విడదీయరాని అనుబంధం ఉన్నదని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Webdunia
బుధవారం, 29 మార్చి 2017 (08:23 IST)
తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు పలికిన రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ తెలుగు నేలతో తనకున్న అనుబంధాన్ని తల్చుకుని భావోద్వేగానికి గురయ్యారు. తెలుగు నేలతో తనకు విడదీయరాని అనుబంధం ఉన్నదని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు. పైగా తెలుగు నేల తనకు మరు జన్మను ప్రసాదించిందని కూడా చెప్పారు.
 
హైదరాబాద్ లోని రాజ్‌భవన్‌లో మం‍గళవారం రాత్రి ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించిన సందర్భంగా గవర్నర్ హేవళంబి సంవత్సరం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల  ప్రజలకు సుఖసంతోషాలు ఇవ్వాలని, రెండు రాష్టాలూ సమృద్ధిని సాధించాలని కోరుకున్నారు. రాజ్ భవన్‌లో తన ముందు రెండు రాష్టాలు ఉన్నాయని, ఇలాగే కలిసి మెలిసి ఉండాలని కోరుకున్న గవర్నర్ తనకు తెలుగు రాష్ట్లాలు అంటే ఎందుకు అంత ఇష్టమో చెబుతూ పాత జ్ఞాపకాలు పంచుకున్నారు.
 
గవర్నర్ చెప్పిన మాటల బట్టి ఆయన చదువు తెలుగునేలపైనే మొదలైంద. ఆయన మొదటి ఉద్యోగం కూడా తెలుగు గడ్డపైనే ప్రారంభమైంది. పైగా నలభై ఆరేళ్ల కిందట కర్నూలు జిల్లాలో జరిగిన ఒక దుర్ఘటనలో ఆయన రెండు రోజులపాటు కోమాలోకి వెళ్లి బతికిబయట పడ్డారు. తెలుగు నేల తనకు పునర్జన్మ ఇచ్చిందని చెప్పిన గవర్నర్ అదికూడా ఉగాది రోజే జరిగిందని, అందుకే ఉగాది అంటే తమ కుటుంబానికి ప్రత్యేకమని చెప్పారు. 
 
కాగా, ఉగాది వేడుకలకు సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి తెలంగాణ సీఎల్పీ నేత కె.జానారెడ్డి, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌ అలీ, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హాజరయ్యారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments