Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుస్తెలమ్మైనా పులస తినాలన్నది నానుడి.. రూ.వేలు పలికిన గోదారి పులస! (video)

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (10:45 IST)
పుస్తెలమ్మైనా పులస తినాలన్న నానుడి వాడుకలో ఉంది. ముఖ్యంగా గోదారి పులసకు ఉండే ప్రత్యేకత ఇంతాఇంతా కాదు. అంటే.. గోదారి పులస రుచి అలాంటిది మరి. అయితే, ఈ పులస రుచిలాగానే ధర కూడా ఉంటుంది. పులసలకు పెట్టింది పేరు... తూర్పు'గోదావరే'! 
 
జూలై - సెప్టెంబరు నెలల మధ్య వర్షాకాలంలో.. 'ఇలస' చేప.. గోదావరి జలాల్లో ఎదురీదుతూ.. 'పులస'గా మారుతుందని చెబుతారు. మత్స్యకారుల వలకు చాలా అరుదుగా పడతాయి. కిలో రూ.4 వేల వరకు ఉంటుంది. దేశంలోనే ఖరీదైన చేప అంటారు. దీని రుచి గురించి తెలిసినవారు.. ధర గురించి ఏమాత్రం ఆలోచించరు.
 
తాజాగా.. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడి వద్ద గోదావరి నదిలో ఆదివారం స్థానిక మత్స్యకారుడి వలలో రెండున్నర కిలోల పులస చేప పడింది. పాశర్లపూడిలో నగరం ఏఎంసీ ఛైర్మన్‌ కొమ్ముల కొండలరావు ఈ చేపను రూ.21 వేలుకు కొనుగోలు చేయడం విశేషం. 
 
పులస సాధారణంగా 3 కిలోలకు మించి బరువుండదు. ఎక్కువగా అరకిలో, కిలో లోపు చేపలే దొరుకుతాయి. కానీ ఈ పులస ఏకంగా రెండున్నర కిలోలు ఉండటంతో ధర కూడా ఓ రేంజ్‌లోనే పలికిందన్నమాట. అద్గదీ గోదారి పులస కథ. 

 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments