Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైన మూడు రోజులకే వధువు మృతి.. పెద్దల అంగీకారంతోనే ప్రేమ పెళ్ళి.. ఏమైందో?

పెళ్లై మూడు రోజులైంది. కాళ్ల పారాణి ఆరక ముందే అనుమానాస్పద రీతిలో ఆ వివాహిత ప్రాణాలు కోల్పోయింది. పెళ్లైన మూడు రోజులకే పెళ్లిబాజాలు మోగిన ఆ ఇంట మృత్యు ఘంటికలు మోగాయి. పెళ్లి సందడితో కళకళలాడిన ఇల్లు బంధ

Webdunia
ఆదివారం, 21 ఆగస్టు 2016 (10:05 IST)
పెళ్లై మూడు రోజులైంది. కాళ్ల పారాణి ఆరక ముందే అనుమానాస్పద రీతిలో ఆ వివాహిత ప్రాణాలు కోల్పోయింది. పెళ్లైన మూడు రోజులకే పెళ్లిబాజాలు మోగిన ఆ ఇంట మృత్యు ఘంటికలు మోగాయి. పెళ్లి సందడితో కళకళలాడిన ఇల్లు బంధువుల రోదనతో శోకసంద్రంలో మునిగిపోయింది.

ప్రేమించి పెళ్లాడిన భర్త ఆమె మృతికి కారణమయ్యాడని కుటుంబ సభ్యులు రోదించారు. ఈ ఘటన పశ్చిమగోదావరిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా పెర్కిపాలెం గ్రామానికి చెందిన చిక్కాల శైలజ (22)కు బుధవారం వివాహం కాగా శనివారం నాటికి మృత్యు ఒడికి చేరింది.
 
పెర్కిపాలెం గ్రామానికి చెందిన చిక్కాల నారాయణరావు కుమారై శైలజకు శృంగవృక్షం గ్రామానికి చెందిన కవురు ఏసుబాబుతో బుధవారం ఈ నెల 17న వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం. పెద్దల అంగీకారంతోనే వీరిద్దరి వివాహం అట్టహాసంగా జరిగింది. కాగా శనివారం మధ్యా హ్నం కొత్త దంపతులు గొడవపడ్డారు.

గొడవ జరిగిన కొద్ది సేపటికే శైలజ పడకగదిలో ఉరివేసుకుని ఉందని, తాము చూసేసరికి మృతి చెందిందని కుటుంబ సభ్యులు చెపుతున్నారు. శైలజ తండ్రి నారాయణరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుడు ఏసుబాబును అదుపులోకి తీసుకున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments