Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 నుంచి హనుమ జన్మక్షేత్రంపై వెబినార్‌

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (10:57 IST)
హనుమంతుడి జన్మక్షేత్రంపై ఎస్వీ ఉన్నత వేద అధ్యయన సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 30, 31 తేదీల్లో తిరుపతిలో వెబినార్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు టీటీడీ పరిపాలన భవనంలో టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి ఆధ్వర్యాన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

ఈ వెబినార్‌లో ఆంజనేయుడి జన్మస్థలానికి సంబంధించిన పురాణాల్లో ప్రమాణికత, వేంకటాచల మహాత్యం ప్రామాణికత, తిరుమల ఇతిహాసం, తిరుమలతో ఆంజనేయుడికి ఉన్నపురాణ సంబంధ అంశాలు, శ్రీ వేంకటేశ్వర ఇతిహాసమాల ప్రాశస్త్యం వంటి అంశాలు ఉంటాయి.

వీటితో పాటు హనుమంతుడి జన్మస్థలం, వాఙ్మయ ప్రమాణాలు, సంస్కృత వాఙ్మయం హనుమంతుడు, వైష్ణవ సాహిత్యంలో తిరుమల, శాసన ప్రమాణాలు, భౌగోళిక ప్రమాణాలు ఇతర అంశాలపై వెబినార్‌ నిర్వహిస్తారు. ఈ వెబినార్‌లో మఠాధిపతులు, వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన ఉన్నతస్థాయి పరిశోధకులు పాల్గొంటారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments