దేశంలో ముగిసిన నైరుతి సీజన్... ప్రారంభంకానున్న ఈశాన్యం.. బంగాళాఖాతంలో అల్పపీడనం

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2023 (15:36 IST)
దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసింది. ఇకపై ఈశాన్య రుతుపవన సీజన్ ప్రారంభంకానుంది. అదేసమయంలో బంగాళాఖాతంలో శుక్రవారం ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. అది వాయుగుండంగా మారే మారి మరింతగా బలపడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 
 
ఇదిలావుంటే దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్‌లో అనేక రాష్ట్రాల్లో తగినంత వర్షపాతం నమోదుకాలేదు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఈశాన్య రుతుపవనాలపైనే ఆశలుపెట్టుకునివున్నాయి. ఈశాన్య రుతుపవనాలు వస్తూనే అల్పపీడనం ఏర్పడేందుకు అనువైన పరిస్థితులు నెలకొన్నాయి. 
 
ఇందులోభాగంగా, శుక్రవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది శనివారానికి అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది వాయువ్య దిశగా పయనించి అక్టోబరు 23వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడుతుందని వివరించింది. దీని ప్రభావం ఉత్తరాంధ్రపై కూడా ఉంటుందని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కాలికి దెబ్బ తగిలితే నిర్మాత చిట్టూరి సెంటిమెంట్ అన్నారు : అల్లరి నరేష్

Nayanthara: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రంలో నయనతార లుక్

అర్జున్, ఐశ్వర్య రాజేష్ ల ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా మఫ్టీ పోలీస్ సిద్ధం

రాజు వెడ్స్ రాంబాయి కి కల్ట్ మూవీ అనే ప్రశంసలు దక్కుతాయి - తేజస్వినీ, అఖిల్ రాజ్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments