Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటుకు నోటు కేసు: రేవంత్‌కి ఎదురు దెబ్బ... సెబాస్టియన్, ఉదయసింహలకు స్వల్ప ఊరట

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2015 (12:29 IST)
ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు, తెలంగాణ టీడీపీ ఉపనేత రేవంత్ రెడ్డికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. అయితే ఈ కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయసింహలకు స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో బెయిల్ షరతులను సడలించాలన్న రేవంత్ పిటిషన్‌ను ఏసీపీ ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం  ఏసీబీ కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఇప్పటికే ఈ విషయంలో రేవంత్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే.
 
కొడంగల్‌కే పరిమితం కావాలన్న షరతుతో రేవంత్‌కి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ శాసనసభాపక్ష ఉపనేతగా ఉన్న తాను హైదరాబాదులో ఉండాల్సిన అవసరమున్న నేపథ్యంలో ఆ షరతును సడలించాలని రేవంత్ రెడ్డి హైకోర్టును కోరారు. ఈ కేసు సోమవారం విచారణకు వచ్చింది. అప్పుడు రేవంత్ రెడ్డి హైదరాబాదులో ఉంటే, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదముందని ఏసీబీ అధికారులు వాదించారు. ఇరు తరపు వాదనలు విన్న హైకోర్టు రేవంత్ రెడ్డి వినతిని తోసిపుచ్చింది. దీంతో మరికొంతకాలం పాటు రేవంత్ రెడ్డి కొడంగల్‌కే పరిమితం కాక తప్పని పరిస్థితి నెలకొంది.
 
ఇదే కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయసింహల బెయిల్ షరతులను కోర్టు కొంతమేర సడలించింది. ఇక నుంచి ఈ కేసులో ప్రతిరోజు కాకుండా వారంలో సోమవారం, గురువారం, శుక్రవారం మాత్రమే ఏసీబీ అధికారుల ఎదుట హాజరుకావాలని తెలిపితూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments