Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టిన వాలంటీర్ - భార్య ఆత్మహత్యాయత్నం

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2023 (11:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థపై అనేక రకాలైన విమర్శలు వస్తున్నాయి. వలంటీర్లుగా పని చేసే అనేక మంది వివిధ రకాలైన నేరాలకు ఘోరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ వాలంటీర్ వ్యవహారశైలి భార్యాభర్తల మధ్య చిచ్చురేపింది. దీంతో వివాహిత పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం రావులపాడులో ఒక వాలంటీర్ సమాచారం కోసమంటూ ఓ వివాహిత ఇంటికి తరచూ వెళ్తూ వేధించసాగాడు. ఇది భర్తకు తెలియడంతో ఆ దంపతుల మధ్య మనస్పర్థలు చెలరేగి వివాదానికి దారితీసింది. దీంతో ఇద్దరి మధ్య అగాధం పెరిగి బుధవారం ఆ మహిళ పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు బాధితురాలిని శ్రీకాళహస్తి ఆసుపత్రికి తీసుకెళ్లారు. తరువాత మెరుగైన వైద్యం కోసం తిరుపతి తరలించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments