Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో స్వచ్చంధంగా మూతపడుతున్న థియేటర్లు

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (10:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా థియేటర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్రభుత్వ నిబంధనలు పాటించని థియేటర్లపై ఏపీ అధికారులు కొరఢా ఝుళిపిస్తున్నారు. అలాగే, అపరిశుభ్రంగా, నిబంధనలు పాటించడం లేదన్న సాకులతో పలు థియేటర్లను అధికారులు సీజ్ చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో ఇప్పటికే చిత్తూరు జిల్లాలో థియేటర్లపై అధికారులు కొరఢా ఝుళిపించారు. ఈ జిల్లాలో 11 థియేటర్లను మూసివేశారు. మదనపల్లి రెవెన్యూ డివిజన్‌లో 37 సినిమా హాళ్ళకు నోటీసులు ఇచ్చారు. వీటిలో 16 థియేటర్లను గురువారం మూసివేశారు. మదనపల్లిలో 7, కుప్పంలో 4 చొప్పున థియేటర్లు మూసివేశారు. 
 
ఈ పరిస్థితుల్లో అనంతపురం జిల్లాలో పలు సినిమా థియేటర్లను యజమానులు స్వచ్చంధంగా మూసివేస్తున్నారు. పెనుకొండలో మూడు, గోరంట్లలో ఓ థియేటర్‌ను యజమానులు మూసివేశారు. అలాగే, ఇతర ప్రాంతాల్లోనూ పలు థియేటర్లను మూసివేసే దిశగా యజమానులు సిద్ధమవుతున్నారు. 

సంబంధిత వార్తలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments