Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్కె తీర్చలేదనీ కొట్టి చంపేశాడు.. తాపీమేస్త్రి కిరాతక చర్య

Webdunia
శనివారం, 1 జూన్ 2019 (15:59 IST)
విశాఖపట్టణంలోని అరకులోయ మండలానికి చెందిన యువతి (19)పై 23 యేళ్ల తాపీమేస్త్రి అత్యాచార యత్నానికి ప్రయత్నించారు. అయితే, ఆమె లొంగకపోగా, ఆ కామాంధుడి చర్యను ప్రతిఘటించింది. దీంతో కోపోద్రిక్తుడైన తాపీమేస్త్రి ఆమెను గట్టిగా కొట్టి మెట్లపై తోసేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ యువతి ఆస్పత్రి చికిత్స పొందుతోంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, వైజాగ్‌లోని అచ్యుతాపురంలోని జంగులూరు జంక్షన్‌ దగ్గర ఒక ఆపార్టుమెంటు నిర్మాణం జరుగుతోంది. ఇందులో 19 యేళ్ళ యువతి భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తుంటే, ఇక్కడే బాణాల సురేష్ (23) అనే యువకుడు తాపీమేస్త్రిగా ఉన్నాడు. ఈయనకు ఆ యువతితో శారీరక సుఖం తీర్చుకోవాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తుంటే, ఆ యువతి తిరస్కరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి యువతిని బలవంతం చేయబోగా ప్రతిఘటించింది. 
 
దీంతో కోపోద్రిక్తుడైన సురేష్‌… ఆమెను తీవ్రంగా కొట్టి మెట్లపై నుంచి తోసేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువతి మృతిచెందినట్టు ఎస్‌ఐ జి.లక్ష్మణరావు తెలిపారు. ఈ ఘటనపై ఎలమంచిలి సీఐ విజయనాథ్‌ శుక్రవారం విచారణ చేపట్టారు. సురేష్‌పై అట్రాసిటీ, అత్యాచారం, హత్య కేసులను నమోదు చేసి అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments