లావుగా ఉండే మహిళలు, యువతులే టార్గెట్.. కారు డ్రైవర్ ఘరానా మోసం

Webdunia
ఆదివారం, 17 నవంబరు 2019 (10:57 IST)
విశాఖపట్టణం నగరంలో ఓ కారు డ్రైవర్ ఘరానా మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. పలువురు మహిళలు, అమ్మాయిలను మోసం చేసినట్టు వెల్లడైంది. ముఖ్యంగా, లావుగా ఉన్న మహిళలు, యువతులను టార్గెట్ చేసి, వారివద్ద లక్షలాది రూపాయలు గుంజుకున్నట్టు తేలింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విశాఖ నగరంలో కంచరపాలెం ప్రాంతానికి చెందిన అజిత్ కుమార్ అనే వ్యక్తి కారు డ్రైవర్‌గా ఉన్నాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, తాను విశాఖలో పలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యుడునంటూ, తన వద్ద ఉన్న ఫేక్ ఐడీ కార్డులతో మహిళలు, యువతులు పరిచయం చేసుకుంటాడు. 
 
ఉదయం పూట బీచ్ రోడ్డు ప్రాంతంలో నడిచే వాకర్స్‌ను టార్గెట్ చేస్తూ పరిచయం పెంచుకుంటాడు. లావుగా ఉన్నారని, డైట్ అవసరమని చెప్పి తన ఫోన్ నెంబర్ ఇస్తాడు. అలా పరిచయం అయిన వాళ్ళతో ఫేస్‌బుక్ ద్వారా కనెక్ట్ అవుతాడు. 
 
వారితో సాన్నిహిత్యం పెంచుకుని శారీరకంగా లోబర్చుకుని వీడియోలు చిత్రీకరించేవాడు. ఆ వీడియోలతో బెదిరించి డబ్బు, నగలు అందినకాడికి దోచుకునేవాడు. అలా అజిత్ కుమార్ చేతిలో మోసపోయిన ఓ మహిళ స్పందన కార్యక్రమం ద్వారా పోలీసులను ఆశ్రయించడంతో అతడి బండారం బయటపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొత్త బిజినెస్ ప్రారంభించిన సమంత.. నటి, నిర్మాత, వ్యాపారవేత్తగా శామ్ అదుర్స్

మైనర్ బాలికతో శృంగారం చేసే మహానుభావులకు థ్రిల్‌గా ఉంటుంది : చిన్మయి

అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి సారీ చెప్పిన మంత్రి కొండా సురేఖ

చికిరి చికిరి పాటకు నేపాల్ అమ్మాయి స్టెప్పులు.. అదరగొట్టేసిందిగా.. ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments