Webdunia - Bharat's app for daily news and videos

Install App

లావుగా ఉండే మహిళలు, యువతులే టార్గెట్.. కారు డ్రైవర్ ఘరానా మోసం

Webdunia
ఆదివారం, 17 నవంబరు 2019 (10:57 IST)
విశాఖపట్టణం నగరంలో ఓ కారు డ్రైవర్ ఘరానా మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. పలువురు మహిళలు, అమ్మాయిలను మోసం చేసినట్టు వెల్లడైంది. ముఖ్యంగా, లావుగా ఉన్న మహిళలు, యువతులను టార్గెట్ చేసి, వారివద్ద లక్షలాది రూపాయలు గుంజుకున్నట్టు తేలింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విశాఖ నగరంలో కంచరపాలెం ప్రాంతానికి చెందిన అజిత్ కుమార్ అనే వ్యక్తి కారు డ్రైవర్‌గా ఉన్నాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, తాను విశాఖలో పలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యుడునంటూ, తన వద్ద ఉన్న ఫేక్ ఐడీ కార్డులతో మహిళలు, యువతులు పరిచయం చేసుకుంటాడు. 
 
ఉదయం పూట బీచ్ రోడ్డు ప్రాంతంలో నడిచే వాకర్స్‌ను టార్గెట్ చేస్తూ పరిచయం పెంచుకుంటాడు. లావుగా ఉన్నారని, డైట్ అవసరమని చెప్పి తన ఫోన్ నెంబర్ ఇస్తాడు. అలా పరిచయం అయిన వాళ్ళతో ఫేస్‌బుక్ ద్వారా కనెక్ట్ అవుతాడు. 
 
వారితో సాన్నిహిత్యం పెంచుకుని శారీరకంగా లోబర్చుకుని వీడియోలు చిత్రీకరించేవాడు. ఆ వీడియోలతో బెదిరించి డబ్బు, నగలు అందినకాడికి దోచుకునేవాడు. అలా అజిత్ కుమార్ చేతిలో మోసపోయిన ఓ మహిళ స్పందన కార్యక్రమం ద్వారా పోలీసులను ఆశ్రయించడంతో అతడి బండారం బయటపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments