Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ రైల్వే జోన్ డీపీఆర్ సిద్ధం... ఏపీ ప్రభుత్వం స్థలం ఇవ్వడం లేదు : మంత్రి అశ్వినీ

ఠాగూర్
గురువారం, 1 ఫిబ్రవరి 2024 (16:38 IST)
విభజన హామీల్లో భాగంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే జోన్‌ను విశాఖపట్టణం కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకోసం డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు కూడా తయారైందని కానీ, రైల్వే జోన్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని మాత్రం ఏపీ ప్రభుత్వం కేటాయించడం లేదని కేంద్ర రైల్వే శాఖామంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 
 
లోక్‌సభలో గురువారం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఆయన మాట్లాడుతూ, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేవలం 53 ఎకరాల భూమిని కేటాయించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఇప్పటికే అడిగామని కానీ, ఇప్పటివరకు అప్పగించలేదని చెప్పారు. రైల్వే జోన్ ఏర్పాటుకు డీపీఆర్ కూడా సిద్ధమైందన్నారు. భూమి అస్తే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. 
 
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు 2009 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీలో రైల్వే అభివృద్ధికి రూ.886 కోట్ల నిధులు ఇవ్వగా ప్రస్తుత బడ్జెట్‌లో ఒక్క ఏపీకే రూ.9138 కోట్లు కేటాయించామని తెలిపారు. ఆంధ్రాలో యేడాదికి 240 కిలోమీటర్ల మేరకు కొత్త ట్రాక్ నిర్మాణం సాగుతుందన్నారు. 98 శాతం విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయని వివరించారు. అలాగే, ఈ బడ్జెట్‌లో తెలంగాణాకు రూ.5071 కోట్లను కేటాయించడం జరిగిందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments