విశాఖ గడ్డపై పవన్ అడుగుపెట్టగానే గర్జగన్ గాల్లో కలిసిపోయింది... టీడీపీ

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2022 (10:57 IST)
విశాఖపట్టణం గడ్డపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అడుగుపెట్టగానే మూడు ముక్కలాట కోసం వైకాపా మంత్రులు తలపెట్టిన గర్జన గాల్లో కలిసిపోయిందని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ అన్నారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, జైలు కూడు రుచి చూసిన జగన్మోహన్ రెడ్డి ఇపుడు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరినీ జైలుకు పంపించాలని భావిస్తున్నారని ఆరోపించారు. 
 
విశాఖ పర్యటనలో హీరో పవన్ కళ్యాణ్ పట్ల పోలీసులు హుందాగా ప్రవర్తించలేదన్నారు. అదేసమయంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉండబోదని, ప్రభుత్వాలు మారుతాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని ఆయన అన్నారు. 
 
వైసీపీ చేపట్టిన విశాఖ గర్జన తుస్సుమందని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ విశాఖలో అడుగు పెట్టిన వెంటనే విశాఖ గర్జన గాల్లో కలిసిపోయిందంటూ ఎద్దేవా చేశారు. ఆ అక్కసుతోనే జనసేన నేతలపై అక్రమ కేసులు పెట్టారని చెప్పారు. పోలీసులు హుందాగా వ్యవహరించడం లేదని... ప్రభుత్వాలు మారుతాయనే విషయాన్ని కొందరు అధికారులు గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. 
 
మరోవైపు, విశాఖ విమానాశ్రయం వద్ద వైసీపీ మంత్రులపై జరిగిన దాడి కేసుకు సంబంధించి అరెస్టు అయిన జనసేన నాయకులు, కార్యకర్తలకు కోర్టులో ఊరట లభించింది. అరెస్ట్ అయిన వారిలో 61 మందిని రూ.10 వేల పూచీకత్తుపై కోర్టు విడుదల చేయగా, 9 మందికి మాత్రం ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rana: దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే.. కాంత ఫస్ట్ సింగిల్ కు రెస్పాన్స్

షాప్ ఓనర్ నన్ను చూసి విక్రమ్‌లా ఉన్నారు అన్నారు : బైసన్ హీరో ధృవ్ విక్రమ్

Rana Daggubati: మిరాయ్ సీక్వెల్ లో రానా దగ్గుబాటి కీలకం అంటున్న తేజ సజ్జా

RT76: స్పెయిన్‌లో రవితేజ తో సాంగ్ పూర్తిచేసుకున్న ఆషికా రంగనాథ్

నిర్మాతలు ఆర్టిస్టులను గౌరవించడం లేదు : హీరో నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments