Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తదానం చేసిన శునకం ... ఎక్కడ?

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2022 (11:41 IST)
సాధారణంగా రక్తదానం చేసేందుకు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న మనుషులే వెనుకంజ వేస్తున్న ఈ రోజుల్లో శునకాలు మాత్రం రక్తదానం చేసేందుకు సై అంటున్నాయి. తాజాగా ప్రాణాపాయంలో ఉన్న శునకాలకు రక్తం ఎక్కించి వాటి ప్రాణాలు రక్షించేందుకు వీలుగా శునకాల నుంచి రక్తాన్ని సేకరిస్తున్నారు. ఈ బృహత్తర కార్యక్రమం ఆదివారం విశాఖ నగరంలో ప్రారంభించారు. 
 
పెదవాల్తేరులోని పావ్స్ ఎన్ టెయిల్స్ ప్రీమియం పెట్ హాస్పిటల్‌లో ఈ రక్త సేకరణ శిబిరాన్ని నిర్వహించారు. శునకాల నుంచి రక్తాన్ని సేకరించేందుకు ఒక శిబిరాన్ని నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
చీఫ్ వెటర్నరీ సర్జన్ డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో పది శునకాల నుంచి రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొన్ని సందర్భల్లో ముఖ్యంగా ప్రాణాపాయస్థిలో ఉన్న సమయంలో శునకాలకు కూడా ఆపరేషన్లు చేయాల్సి వస్తుందన్నారు. అలాంటి సమయంలో రక్తం అవసరం అవుతుందని, ఇందుకోసమే శునకాల నుంచి రక్తాన్ని సేకరించినట్టు ఆయన తెలిపారు. సేకరించిన రక్తాన్ని సురక్షితంగా నిల్వ చేసే ఏర్పాట్లు కూడా చేసినట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments