Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ శ్మశానంలో ఎటుచూసినా శవాల దహనాలే ... కానీ చనిపోయింది ఒక్కరేనట...

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (07:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్రంలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తారా స్థాయికి చేరుకున్నాయి. అలాగే, మృతులు కూడా పెరిగిపోతున్నారు. దీంతో శ్మశానవాటికల్లో ఎటు చూసినా శవాల దహనాలే జరుగుతున్నాయి. 
 
నిజానికి విశాఖలోని పలు శ్మశానాల్లో రోజుకు నాలుగైదు మృతదేహాలకు మాత్రమే దహనక్రియలు జరుగుతుంటాయి. అలాంటి వాటికల్లో తక్కువలో తక్కువ 15 నుంచి 20 మృతదేహాలు ప్రతిరోజూ తగలబడుతున్నాయి. కరోనా ఉధృతి పెరిగిన నేపథ్యంలో చితులు ఆరకుండా మండుతున్నాయి. 
 
విశాఖ నగరంలో ఎక్కడ కరోనా రోగి మరణించినా జ్ఞానాపురం శ్మశాన వాటికలోనే దహనం చేస్తారు. ఇక్కడికి రోజూ 16 నుంచి 22 వరకు ఇలాంటి మృతదేహాలు వస్తున్నాయి. ఒక దగ్గర వేసిన చితిమంట ఆరక ముందే మరో మృతదేహం అంబులెన్స్‌లో వస్తోంది. కాటికాపరులు కరోనా మృతదేహాలను పక్కపక్కనే వరుసగా పెట్టి దహనం చేస్తున్నారు.
 
గురువారం ఒక్కరోజే సుమారు 18 మృతదేహాలను ఇక్కడ దహనం చేశారు. అయితే, అధికారులు మాత్రం ఒక్కరే చనిపోయారని ప్రకటించడం గమనార్హం. గుంటూరు సిటీలోని బొంగరాలబీడు శ్మశానవాటిక గురువారం కూడా ఆరకుండా మండుతూనే ఉంది. రోజంతా కరోనా మృతదేహాలు వచ్చిపడుతూనే ఉన్నాయి. ఆరని చితులతో నిండిన శ్మశానవాటికలోని దృశ్యాలను వాటిక గోడలపైకి ఎక్కి యువకులు చూడటం కనిపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments