Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్య కేసు విచారణ పూర్తయింది : సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ

ఠాగూర్
మంగళవారం, 5 ఆగస్టు 2025 (13:44 IST)
మాజీ మంత్రి, వైకాపా నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ పూర్తయిందని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కోర్టుకు తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఈ హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుల్లో వైకాపాకు చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఒకరు. ఈ కేసులో ఆయనను అరెస్టు చేయకుండా గతంలో కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 
 
ఈ బెయిల్‌‍ను రద్దు చేయాలని కోరుతూ వివేకా కుమార్తె డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ కేసు విచారణ  పూర్తయిందని కోర్టుకు తెలిపింది. ఒక వేళ సుప్రీంకోర్టు ఆదేశిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని కోర్టుకు తెలిపింది. 
 
అలాగే, వివేకా కుమార్తె సునీత తరపున సీనియర్ కౌన్సిల్ మరో కోర్టులో ఉండటంతో విచారణకు న్యాయవాది సమయం కోరారు. దీంతో ధర్మాసనం పాస్ ఓవర్ చేసింది. ఆ తర్వాత వాదనలు వినిపించేందుకు సిద్ధమని సునీత తరపు న్యాయవాది లూథ్రా ధర్మాసనానికి విన్నవించారు. భోజనం విరామం తర్వాత బెంచ్ కొనసాదడం లేదని, అందువల్ల మరోరోజు విచారణ చేపడుతామని జస్టిస్ సుందరేశ్ తెలిపారు. దీంతో తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

షారూక్‌ ఖాన్‌ను ఉత్తమ నటుడు అవార్డు ఎలా ఇస్తారు? నటి ఊర్వశి ప్రశ్న

టాలీవుడ్‌ డైరెక్టర్‌తో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఉమెన్ సెంట్రిక్ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments