Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్య కేసు : కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ మళ్లీ నోటీసులు

Webdunia
ఆదివారం, 5 మార్చి 2023 (11:51 IST)
వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఆ పార్టీకి చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోమారు నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులను పులివెందులలోని అవినాశ్ రెడ్డి సీబీఐ అధికారులు వెళ్లి అందజేశారు. మార్చి ఆరో తేదీ సోమవారం విచారణకు హాజరుకావాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందులో హైదరాబాద్ నగరంలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని తెలిపారు.
 
మరోవైపు, ఈ నోటీసులపై అవినాశ్ రెడ్డి స్పందించారు. తాను సోమవారం విచారణకు హాజరుకాలేనని సీబీఐ అధికారులకు స్పష్టంచేశారు. అయితే, ఆరో తేదీన ఖచ్చితంగా విచారణకు వచ్చితీరాల్సిందేనంటూ సీబీఐ అధికారులు హుకుం జారీచేశారు. 
 
మరోవైపు, ఇదే కేసుకు సంబంధించి అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా సీబీఐ అధికారులు నోటీసులు జారీచేసిన విషయం తెల్సిందే. ఈ నెల 12వ తేదీన విచారణకు రావాల్సిందిగా భాస్కర్ రెడ్డికి ఇచ్చిన నోటీసులు జారీ చేయగా, తాజాగా ఈ నెల 6వ తేదీనే విచారణకు హాజరుకావాలని ఆయనకు సీబీఐ అధికారులు సూచించారు. అయితే, అవినాశ్ రెడ్డి విచారణ హైదరాబాద్ నగరంలోనూ, భాస్కర్ రెడ్డి విచారణ పులివెందులలోనూ జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments