Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు గ్రాఫ్ పడిపోయింది.. 2019లో జగనే సీఎం: విష్ణుకుమార్ జోస్యం

ఏపీ సీఎం చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందని.. రానున్న రోజుల్లో అదీ కాస్త పూర్తిగా పడిపోతుందని.. బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన చంద్రబాబు..

Webdunia
గురువారం, 3 మే 2018 (15:54 IST)
ఏపీ సీఎం చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందని.. రానున్న రోజుల్లో అదీ కాస్త పూర్తిగా పడిపోతుందని.. బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన చంద్రబాబు.. హైదరాబాదులో వుంటే ఇబ్బందులు వస్తాయని భావించారన్నారు.


అందుకే అక్కడి నుంచి పారిపోయి., విజయవాడకు మకారం మార్చారని విష్ణు సెటైర్లు విసిరారు. అంతేగాకుండా.. 2019 ఎన్నికల్లో వైకాపా విజయం సాధిస్తుందని.. వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని విష్ణు జోస్యం చెప్పారు. 
 
గురువారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం విష్ణుకుమార్ రాజు మీడియా మాట్లాడుతూ.. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని తెలుగు వారు బీజేపీకి ఓటు వేయొద్దని చంద్రబాబు పిలుపు ఇవ్వడం ఏమిటని మండిపడ్డారు.

చంద్రబాబు పిలుపుతో కర్ణాటకలో ఉన్న తెలుగువారు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వుందని తెలిపారు. టీడీపీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని విష్ణు ఆరోపణలు చేశారు. టీడీపీ అవినీతిని త్వరలోనే బహిర్గతం చేస్తామని విష్ణు చెప్పారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments