Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖపట్నంలో మరో భారీ అగ్నిప్రమాదం.. జడుసుకున్న జనం

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (07:49 IST)
విశాఖపట్నంలో మరో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ పరిశ్రమలో మంటలు చెలరేగడం వల్ల స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. గత ఏడాది సంభవించిన ఎల్జీ పాలిమర్స్ ఉదంతాన్ని గుర్తు చేసుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. దీనికోసం రెండు గంటలకు పైగా శ్రమించాల్సి వచ్చింది. మంటలు చెలరేగడానికి గల కారణాల కోసం అన్వేషిస్తున్నారు.
 
తాజాగా- అగనంపూడి సమీపంలోని ఏపీఐఐసీ మినీ ఆటోనగర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడున్న ప్యారామౌంట్‌ సన్‌ లియో ఆగ్రో ఇండస్ట్రీస్‌ కంపెనీలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. వంట నూనెలు తయారు చేస్తోన్న సమయంలో మంటలు చెలరేగాయి వంటనూనెల ప్యాకింగ్ ప్లాంట్‌లో తొలుత మంటలు చెలరేగినట్లు చెబుతున్నారు. 
 
అగ్నికీలలు మిగిలిన యూనిట్లకు వ్యాపించకుండా ఉద్యోగులు, సిబ్బంది ప్రయత్నించారు. మంటలు అదుపులోకి రాలేదు. మరింత విస్తరించాయి. వంటనూనెల తయారీ యూనిట్‌కు వ్యాపించాయి. ఫార్మాసిటీ, పెదగంట్యాడల నుంచి మూడు అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి రప్పించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘటన చోటు చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments