Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటు వేయించుకుని ముఖం చేస్తున్నారు .. అందుకే బైపోల్‌ను బహిష్కరిస్తున్నాం...

Webdunia
ఆదివారం, 3 అక్టోబరు 2021 (16:28 IST)
ఏపీలోని బద్వేల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 30వ తేదీన జరుగనుంది. ఇందులో అధికార వైకాపాతో పాటు.. టీడీపీ, బీజేపీ అభ్యర్థులు పోటీ చేయనున్నాయి. జనసేన పార్టీ ఈ ఉప ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. 
 
ఈ నేపథ్యంలో బద్వేల్ ఉప ఎన్నికను బహిష్కరిస్తున్నట్టు ఈ నియోజకవర్గంలోని అట్లూరు మండలం చిన్నమరాజుపల్లె గ్రామస్తులు ప్రకటించారు. తమ గ్రామంలో ఓట్లు వేయమని స్పష్టంచేశారు. 
 
గత 40 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించలేదని చెబుతున్నారు. ఎన్నికల సమయంలో తమ గ్రామానికి వచ్చి ఓట్లు అడగడం, ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఏ నాయకుడు తమ గ్రామం వైపు చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
తమ గ్రామానికి రోడ్డు వేసేంత వరకూ ఏ రాజకీయ పార్టీ నాయకులను మా గ్రామంలోకి అనుమతించమని హెచ్చరించారు. గ్రామ పొలిమేరలో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు గ్రామస్తులు హెచ్చరిక బోర్డు పెట్టారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments