Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూగో జిల్లాలో బాలికపై గ్రామ వలంటీరు అత్యాచారం

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (09:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు ప్రజల ముంగిటకు చేర్చాలన్న ఏకైక లక్ష్యంతో ప్రవేశపెట్టిన గ్రామ వలంటీర్లు ఇపుడు అరాచకాలు, అక్రమాలకు పాల్పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒంటరిగా ఉండే మహిళలపై లైంగిక వేధింపులు, దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఓ గ్రామ వలంటీరు ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లాలోని సీతానగరం మండలం, బొబ్బిల్లంక అనే గ్రామంలో జరిగింది. 
 
అత్యాచారానికి పాల్పడిన వలంటీరును బూసి సతీష్‌ (21)గా గుర్తించారు. బొబ్బిల్లంక గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్న సతీష్... ప్రభుత్వ పథకాల చేరవేత పేరుతో తరచుగా ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఇటీవల బాలిక ఒక్కరే ఇంట్లో ఉండగా, ఇదే అదునుగా భావించిన కామాంధుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. పైగా, ఈ విషయం బయటకు చెపితే చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో ఆ బాలిక మౌనంగా ఉండిపోయింది. 
 
అయితే, ఆ తర్వాత బాలిక ప్రవర్తనలో మార్పు రావడం, ముభావంగా ఉండటంతో తల్లి నిలదీయడంతో జరిగిన విషయం చెప్పి బోరున విలపించింది. దీంతో సీతానగరం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు సతీష్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆ బాలికను రాజమండ్రి ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం