Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్ ... గ్రామ సచివాలయ సిబ్బంది 'జల్సా' పార్టీ

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (14:50 IST)
కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా, వచ్చే నెల మూడో తేదీ వరకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోవుండనుంది. ఈ సమయంలో అత్యవసర సేవలు మినహా ఇతర సేవలు ఒక్కటీ అందుబాటులో వుండవు. కానీ, కొంతమంది జులాయ్‌లు ఈ లాక్‌డౌన్ ఆంక్షలను బ్రేక్ చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో బాధ్యతాయుతంగా నడుచుకోవాల్సిన ప్రభుత్వ సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 
 
తాజాగా, గ్రామ సచివాలయ ఉద్యోగులు కొంతమంది కలిసి జల్సా పార్టీ చేసుకున్నారు. లాక్‌డౌన్ నిబంధనలను తుంగలో తొక్కి ఈ చర్యకు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇది ఈస్ట్ గోదావరి జిల్లా సాఖినేటిపల్లి మండలం, కేశవదాసుపాలెం గ్రామ శివారుల్లో జరిగింది. 
 
కొంతమంది గ్రాస సచివాలయ ఉద్యోగులు కలిసి ఈ పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేశారు. పైగా, దీన్ని వీడియో తీసి తమ స్నేహితుల వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసుకోవడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో ఇది వైరల్ అయింది. కాగా, ఇటీవల ఇదే జిల్లాలో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఓ గ్రామ వలంటీరు పుట్టినరోజు వేడుకలను జరుపుకోగా, 28 మంది హాజరయ్యారు. దీంతో వారందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments