Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌ని ఒత్తిడితో సచివాలయం కార్యదర్శి ఆత్మహత్య?

Webdunia
శనివారం, 3 జులై 2021 (20:42 IST)
జీతం 5 వేలు ప‌ని మాత్రం 12 గంట‌ల‌కు పైనే... పైగా ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌న్నీవీరి చేతుల‌పైనే న‌డ‌వాలి. దీనితో ప‌ని ఒత్త‌డి పెరిగి గ్రామ స‌చివాల‌యం సిబ్బంది స‌త‌మ‌త‌మ‌వుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇలానే ప‌ని ఒత్తిడి త‌ట్టుకోలేక ఒక స‌చివాల‌యం కార్య‌ద‌ర్శి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడని అతడి కుటుంబ సభ్యులు చెపుతున్నారు.

కృష్ణా జిలా మచిలీపట్నంలోని ఎస్.ఎన్. గొల్లపాలెం సచివాలయం కార్యదర్శి మల్లంపాటి సుధాకర్ ఆత్మహత్య కు పాల్ప‌డ్డాడు. మచిలీపట్నం ఇనగుదురుపేటలో నివాసం ఉంటున్న సుధాకర్, త‌న ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పని ఒత్తిడి వల్ల నిత్యం స‌త‌మ‌తం అయ్యేవాడ‌ని, చివ‌రికి అది భ‌రించ‌లేక ఆత్మహత్య చేసుకున్నట్టు బంధువులు పేర్కొంటున్నారు.

అయితే, దీనిపై స‌మ‌గ్రంగా విచార‌ణ చేస్తున్నామ‌ని పోలీసులు చెపుతున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. రెవిన్యూ ఉద్యోగులు, స‌చివాల‌యం సిబ్బంది సుధాక‌ర్ మృతికి సంతాపం తెలిపారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments