Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి అగ్గి మీద 'విజయసాయిరెడ్డి' గుగ్గిలం, సీఎం జగన్ అదే చేస్తారా?

Webdunia
శుక్రవారం, 27 డిశెంబరు 2019 (17:57 IST)
ఇప్పటికే రాష్ట్రం అట్టుడుకుతోంది. ముఖ్యంగా మూడు రాజధానుల వ్యవహారంపై రాష్ట్రంలోని విపక్షాలన్నీ ఆందోళన బాట పట్టాయి. ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటన తీవ్ర దుమారానికి కారణమైంది. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలే తప్ప అధికార వికేంద్రీకరణ కాదంటూ ప్రతిపక్షాలన్నీ మండిపడ్డాయి. అయినాసరే సిఎం పట్టించుకోలేదు.
 
గత పది రోజుల నుంచి రాష్ట్రంలోని 13జిల్లాలో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతుండగా, అమరావతి వేదికగా రైతులు ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో కీలక కేబినెట్ సమావేశం జరుగుతోంది. అయితే విజయసాయిరెడ్డి ఒక్కరోజు ముందుగానే కీలక ప్రకటనలు చేసేశారు.
 
ఇంకేముంది.. మన రాజధాని వైజాగ్. ప్రకటన రేపే. మీరందరూ హ్యాపీగా ఉండండి. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే 3వేల ఎకరాల చూసేశాం. కొన్ని అద్దె భవనాలను కూడా చూశాం. నెల రోజుల్లో అమరావతి మొత్తాన్ని మార్చేస్తాం. అనుకున్నది చేసేస్తున్నాం అంటూ పిచ్చాపాటి మాట్లాడారు. ఇప్పటికే జనం మండిపోతుంటే.. వారిని మరింత ఆగ్రహం గురిచేసేలా విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. 
 
కాగా విజయసాయి రెడ్డి చెప్పినట్లుగానే సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసేసుకుంటారా అనే చర్చ మొదలైంది. ఏం జరుగుతుందో చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments