Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారంరోజుల్లో విజయవాడ రోడ్లు మరమ్మత్తులు: ఎమ్మెల్యే గద్దె రామమోహన్, కేశినేని శ్వేత

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (17:05 IST)
విజయవాడ 11వ డివిజన్లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో యూజిడి పనులు పూర్తి అయ్యిన యాదవుల బజార్, దానయ్యబజార్, భాగయ్యబజార్, కరణంగారి బజార్ లలో శుక్రవారం ఎమ్మెల్యే గద్దె రామమోహన్, టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి కుమారి కేశినేని శ్వేత పర్యటించి రోడ్లు పరిశీలించారు.

వారంరోజుల్లో రోడ్లు మరమ్మతులు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్థానికులకు తెలియజేసారు. గడిచిన టీడీపీ ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టిన అభివృద్ధి పనులకు వైసీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదని, దాని వల్ల కాంట్రాక్టర్లు పనులు చేయలేక పోతున్నారని అన్నారు.

ఈ రహదారుల విషయంలో సమస్య పరిష్కారించే విధంగా సంబంధిత మునిసిపల్ అధికారులతో మాట్లాడటం జరిగిందని, రోడ్లు మరమ్మతులకు వారం రోజులలో పనులు ప్రారంభించే విధంగా ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామని వారు చెప్పారు.

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు, విజృంభిస్తున్న కరోనాపై మరింత జాగ్రత్తలు పాటించేలా అవగాహన కల్పించేందుకు డివిజన్ లో పర్యటిస్తున్నామని అన్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments