Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిక్రాంతి హత్య కేసు : స్కూటీలో ప్రదీప్‌తో వెళ్లిన ఆ వ్యక్తి ఎవరు?

Webdunia
మంగళవారం, 13 ఆగస్టు 2019 (11:06 IST)
విజయవాడ పట్టణంలోని సత్యనారాయణ పురం శ్రీనగర్ కాలనీలో భార్య తలనరికిన కేసులో సరికొత్త కోణం వెలుగులోకి వచ్చింది. భార్య మణిక్రాంతను హత్య చేసిన భర్త ప్రదీప్ కుమార్.. పాటు ఆయన బంధువుల ప్రమేయం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని ఆ ప్రాంతంలోని సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు నిర్ధారిస్తున్నాయి. 
 
సీసీ టీవీ దృశ్యాలకు తోడు మణిక్రాంతి సోదరి పూజారాణి చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు ఊతమిస్తున్నాయి. తన సోదరిని చంపుతుండగా చూసిన కొందరు తనకీ విషయం చెప్పారని పేర్కొంది. మణిక్రాంతిని చంపుతుండగా రికార్డైన దృశ్యాల్లో స్కూటీ ఆగి ఉండడం, ఆ తర్వాత మరో వ్యక్తి వచ్చి ఎక్కిన తర్వాత వెళ్లిపోయినట్టు ఉంది. 
 
స్కూటీపై వెళ్లిన వారిద్దరూ నిందితుడి బంధువులేననేది పూజారాణి ఆరోపణ. బంధువుల సహకారం లేకుండా ప్రదీప్ ఒక్కడే ఈ పని చేసి ఉండడని బాధితురాలి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్కూటీ రిజిస్ట్రేషన్ నంబరు కనిపిస్తే హత్య కేసులో చిక్కుముడి వీడుతుందని అధికారుల చెబుతున్నారు. 
 
కాగా, ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు మణిక్రాంతి కుటుంబ సభ్యులు, ప్రదీప్ బంధువులను విచారిస్తున్నారు. మణిక్రాంతి తలకోసం గాలిస్తున్న పోలీసులకు ఇప్పటి వరకు అది దొరకలేదు. తల లేకుండా పోస్టుమార్టం చేయడానికి వీల్లేదని, చేసినా మృతదేహాన్ని తీసుకెళ్లబోమని మణిక్రాంతి కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments